అక్షరటుడే, వెబ్డెస్క్ : Pak Vs Afghan | పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ (Pakistan–Afghanistan) మధ్య మంగళవారం రాత్రి మళ్లీ ఘర్షణలు చోటు చేసుకున్నారు. రెండు దేశాలు దాడులు చేసుకున్నాయి.
ఇరు దేశాల మధ్య ఇటీవల దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట పాకిస్థాన్ తమపై వైమానిక దాడులు చేపట్టినట్లు అఫ్గాన్ తెలిపింది. దీంతో పాక్ సైనిక పోస్టులపై తాలిబన్లు దాడులు చేపట్టారు. అనంతరం ఘర్షణలు ఆగిపోగా.. మళ్లీ మంగళవారం రాత్రి ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ముందుగా అఫ్గాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ ఆరోపిస్తుంది. తాలిబన్ల దాడులను తాము తిప్పికొట్టినట్లు పాక్ సైన్యం చెబుతుతోంది.
Pak Vs Afghan | శిక్షణ కేంద్రం ధ్వంసం
అఫ్గాన్లో ఖోస్ట్ ప్రావిన్స్ డిప్యూటీ పోలీసు ప్రతినిధి తాహిర్ అహ్రర్ ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. మొదట తాలిబన్లు దాడులు చేశారని పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అఫ్గాన్లో నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులు ఉన్నారని పాక్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను తాలిబన్లు ఖండిస్తున్నారు. తాజాగా తాలిబన్ సైన్యం, టీటీపీ ఉగ్రవాదులు కలిపి దాడులు చేశారని పాక్ ఆరోపించింది. అనంతరం తాము ప్రతిదాడులు చేపట్టామని తెలిపింది. దీంతో అఫ్గాన్ తాలిబన్ పోస్టులు భారీ నష్టాన్ని చవిచూశాయని, దాడి తర్వాత కనీసం ఒక ట్యాంక్ ధ్వంసమైందని పాక్ మీడియా పేర్కొంది. టీటీపీకి చెందిన శిక్షణ కేంద్రాన్ని సైతం ధ్వంసం చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు.