అక్షరటుడే, ఇందూరు:Civil Supplies Corporation | కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఈనెల 20న జాతీయ సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమయ్య(Omayya) తెలిపారు. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy)కి శనివారం సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్లను తీసుకువచ్చందని.. వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్(Nizamabad)లో నిర్వహించే సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, కార్యదర్శి హనుమాన్లు, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Civil Supplies Corporation | 20న సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ కార్మికుల సమ్మె
4
previous post