Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు. తమ వేతనాలను 30 శాతం మేర పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికుల వేతనాలను పెంచాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్మాత దిల్ రాజు(producer Dil Raju)కు బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి వెల్లడించారు. కార్మికుల డిమాండ్లపై చర్చించాలన్నారు. ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు..

ఈ మేరకు తెలంగాణ మంత్రి Telangana Minister కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.. “సినీ కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. గ్రేటర్​ హైదరాబాద్ లాంటి మహానగరంలో బతకాలంటే జీతాలు హైక్​ కావాలి.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ఉంది.. దీని తర్వాత కార్మికులతో నేరుగా మాట్లాడతా.. ఈ అంశాన్ని ప్రస్తుతం దిల్ రాజుకు అప్పగించాం.. దిల్​రాజు నిర్మాతల కౌన్సిల్​తో చర్చిస్తున్నారు..” అని పేర్కొన్నారు.

“తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry) లో పాన్ ఇండియా Pan India-level films స్థాయి సినిమాలు చిత్రీకరిస్తున్నారు. టికెట్ ధరలు పెంచేందుకు అనుమతులు కూడా ఇస్తున్నాం. ఈ క్రమంలో కార్మికుల డిమాండ్లపై చర్చించి, తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.” అని మంత్రి అన్నారు.