అక్షరటుడే, ఇందూరు : Chintakayala Raju Campaign | 25వ డివిజన్ కార్పొరేటర్గా తనను గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని బీఆర్ఎస్ అభ్యర్థి (BRS Corporator Candidate) చింతకాయల రాజు అన్నారు. కోటగల్లి తదితర ప్రాంతాల్లో శనివారం ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు.
Chintakayala Raju Campaign | అండగా ఉంటా..
తానెప్పుడూ ప్రజల మనిషినేనని ఎల్లవేళలా వారికి అండగా ఉంటానని రాజు అన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తనకు డివిజన్పై పూర్తి పట్టు ఉందని.. స్థానికుడిగా ప్రతి సమస్యపై అవగాహన ఉందన్నారు. ఒక్కసారి తనకు అవకాశమిస్తే ఐదేళ్లు ప్రజాసేవ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుడిగా భావించి తనకు ఓటు వేయాలని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి..
బీఆర్ఎస్ (BRS) హయాంలో నగరంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగిందని రాజు ఓటర్లకు గుర్తు చేశారు. డివిజన్కు రావాల్సిన నిధులను పక్కాగా తీసుకువచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.