Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal Mandal | చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

Bheemgal Mandal | చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

- Advertisement -

అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్‌ సీడీపీవో స్వర్ణలత (ICDS CDPO Swarnalatha) అన్నారు. భీమ్‌గల్‌ మండలంలోని ముచ్కూరు గ్రామ రైతువేదికలో మంగళవారం భీమ్‌గల్, వేల్పూర్‌ మండలాల (Bheemgal and Velpur mandals) అంగన్​వాడీ టీచర్లకు పోషణ – చదువు అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్​వాడీ కేంద్రాల్లో (Anganwadi centers) చిన్నారులకు విద్యాభ్యాసంతో పాటు పౌష్టికాహారం అందించాలన్నారు. ఇందులో భాగంగానే బాల్య ఆరంభ దశ విద్యాభివృద్ధికి మూడు నుంచి ఆరేళ్ల పిల్లలకు పౌష్టికారం, శారీరక, మానసిక ఎదుగుదలకు విద్య, ప్రీస్కూల్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 16 నుంచి 18 వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో శిక్షకులు శారద, విజయరాణి, పర్యవేక్షకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Must Read
Related News