Chickpea Crop Damage | శనగపంటకు వరుణ గండం.. ఆందోళనలో రైతులు..

అకాల వర్షాలు శనగ పంట రైతుల్లో గుబులు రేపుతున్నాయి. జిల్లాలో ఉదయం జిల్లాలో వర్షం కురియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అక్షరటుడే,బోధన్ : Chickpea Crop Damage | అకాల వర్షాలు శనగ పంట రైతుల్లో గుబులు రేపుతున్నాయి. జిల్లాలో ఉదయం జిల్లాలో వర్షం కురియడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు.

Chickpea Crop Damage | అల్పపీడన నేపథ్యంలో..

రాష్ట్రంలో అల్పపీడన నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సోమవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. అయితే మండల వ్యవసాయ అధికారులు ముందస్తుగానే సామాజిక మాద్యమాల్లో వర్ష సూచనలను విడుదల చేశారు. జిల్లాలో వందల ఎకరాల్లో శనగపంట సాగైంది. కోతలయ్యాక విక్రయాలకు కోసం పంటను సిద్ధం చేసుకున్నారు. అయితే అధికారుల సూచన మేరకు రైతులు పంటపై తాటిపత్రులు కప్పి జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ కొద్దిమేర పంట తడిసింది. భారీ వర్షాలు (Heavy Rains) కురిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరో రెండురోజులపాటు తేలికపాటి వర్షాలు..

అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాలు లేకపోతే తమ పంటను విక్రయాలకు సిద్ధం చేసుకునేవారమని వారు తెలిపారు.

Related articles

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశకార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.