ePaper
More
    HomeజాతీయంChhattisgarh encounter | ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.....

    Chhattisgarh encounter | ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh encounter | ఛత్తీస్​గఢ్‌లో గురువారం (సెప్టెంబరు 11) భారీ ఎన్​కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ (Maoist leader Modem Balakrishna) సహా పది మంది నక్సలైట్లు హతమయ్యారు.

    ఎన్​కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఛత్తీస్​గఢ్​లోని (Chhattisgarh) గరియాబంద్ జిల్లాలో మావోల కదలికల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా దళాలు కూంబింగ్ ప్రారంభించాయి.

    ఈ క్రమంలో మోయిన్పూర్ పోలీసుస్టేషన్ (Moinpur police station) పరిధిలోని అడవుల్లో తారసపడిన నక్సల్స్ కాల్పులు ప్రారంభించగా.. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.

    Chhattisgarh encounter | కీలక నేత హతం..

    ఈ కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్​తో పాటు మరో తొమ్మిది మంది నక్సలైట్లు (Naxalites) మృతి చెందారు.

    అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న మనోజ్ కోసం బలగాలు ఎప్పటి నుంచో వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో ఆయన హతమయ్యాడు.

    అయితే, ఎన్​కౌంటర్​ ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రాయ్​పూర్ రేంజ్ ఇన్​స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా తెలిపారు.

    నక్సల్స్ సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోలు కాల్పులు జరిపారని చెప్పారు.

    “స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ – CRPF ఎలైట్ యూనిట్), ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్​లో పాల్గొన్నారు.

    కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం కనీసం ఎనిమిది మంది నక్సలైట్లను కాల్చి చంపారు” అని మిశ్రా వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...