Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Railway Station | ఢిల్లీలో బాంబుపేలుళ్ల నేపథ్యంలో నిజామాబాద్​ రైల్వేస్టేషన్​లో తనిఖీలు

Nizamabad Railway Station | ఢిల్లీలో బాంబుపేలుళ్ల నేపథ్యంలో నిజామాబాద్​ రైల్వేస్టేషన్​లో తనిఖీలు

నిజామాబాద్​ రైల్వేస్టేషన్​లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో సోదాలు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Railway Station | ఢిల్లీలో బాంబు పేలుళ్ల (Delhi bomb blasts) నేపథ్యంలో దేశం మొత్తం కేంద్ర హోంశాఖ (Union Home Ministry) హైఅలర్ట్​ ప్రకటించింది. ఈ మేరకు రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానిత వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు.

జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్​లో (railway station) పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్ (Secunderabad Circle Inspector Srinivas), నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఎస్​హెచ్​వో సాయారెడ్డి (Nizamabad Railway Station SHO Sayareddy) ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లో మంగళవారం తనిఖీలు చేశారు. స్టేషన్​లో ప్లాట్​ఫాంలతో పాటు, పార్సల్ సెక్షన్​, అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేశారు.

Must Read
Related News