HomeతెలంగాణPod Taxis | హైదరాబాద్​లో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. త్వరలో పాడ్​ ట్యాక్సీలు!

Pod Taxis | హైదరాబాద్​లో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. త్వరలో పాడ్​ ట్యాక్సీలు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pod Taxis | హైదరాబాద్ (Hyderabad)​ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. నగరంలో జనాభా పెరగడంతో ట్రాఫిక్​ కూడా పెరిగి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికే ట్రాఫిక్​ కష్టాల చెక్​కు మెట్రో రైలు(Metro Train)ను ప్రవేశ పెట్టినా.. ఇంకా రద్దీ అధికంగానే ఉంది. ఒక్క వర్షం పడితే నగరవాసులు గంటల పాటు ట్రాఫిక్​లో ఉండిపోతున్నారు. ఈ క్రమంలో మహా నగరంలో కొత్తగా పాడ్ ​ట్యాక్సీలు (Pod Taxis) ప్రవేశ పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో ట్రాఫిక్​ కష్టాలు తీరుతాయని భావిస్తారు.

Pod Taxis | ఏమిటిఈ  పాడ్​ ట్యాక్సీలు

పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (Personal Rapid Transit) అనేది పట్టణ ప్రాంతాలలో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఉపయోగించే రవాణా వ్యవస్థ. డ్రైవర్​ లేకుండానే ఇవి నడుస్తాయి. చిన్న బాక్సుల మాదిరిగా ఉండే వీటిని పాడ్​ ట్యాక్సీలు అని కూడా అంటారు. ప్రత్యేకంగా నిర్మించిన మార్గాల్లో మాత్రమే ఇవి ప్రయాణించగలవు. ట్రాఫిక్​ రద్దీని (Traffic Congestion) నియంత్రించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక్కో పాడ్​ ట్యాక్సీలో నలుగురి నుంచి ఆరుగురు వరకు ప్రయాణం చేయవచ్చు.

Pod Taxis | పలు మార్గాలపై దృష్టి

ట్రాఫిక్​ రద్దీని పరిష్కరించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Hyderabad Metropolitan Development Authority) పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) పాడ్​ ట్యాక్సీలపై దృష్టి పెట్టింది. పెరుగుతున్న వాహనాలతో నగరంలో ప్రజలు ట్రాఫిక్​ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో పాడ్​ ట్యాక్సీలు ప్రవేశపెట్టాలని యూఎంటీఏ యోచిస్తోంది. పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ హైదరాబాద్​కు అనుకూలంగా ఉంటుందని అధికారులు తేల్చారు. ప్రధానంగా ఐటీ కారిడార్​, వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మొదట ఈ విధానాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నారు.

Pod Taxis | కాలుష్యరహితంగా..

ప్రస్తుతం పాడ్​ ట్యాక్సీలు దుబాయి, లండన్​లో అందుబాటులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్​లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జెవార్​ ఫిల్మ్​ సిటీ వరకు వీటిని అందుబాటులోకి తీసుకున్నారు. ఈ మేరకు డీపీఆర్​కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్​(Hyderabad)లో వాహనాలు పెరగడంతో కాలుష్యం పెరుగుతోంది. దీంతో త్వరలో డీజిల్​ వాహనాలను హైదరాబాద్​లోకి అనుమతించబోమని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల ప్రకటించారు. ఎలక్ట్రిక్​ వాహనాలు కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తామన్నారు. ఈ క్రమంలో విద్యుత్​తో నడిచే పాడ్​ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్​తో పాటు కాలుష్యం కూడా తగ్గనుంది.