ePaper
More
    Homeభక్తిChar Dham Yatra | చార్​ధామ్ యాత్ర నిలిపివేత

    Char Dham Yatra | చార్​ధామ్ యాత్ర నిలిపివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)​లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra )ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపేసిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వైపు ఆదివారం, సోమవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ (Red Alert) జారీ చేసింది. ఈక్రమంలో భక్తుల భద్రత దృష్ట్యా యాత్రను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి వేసింది.

    చార్​ధామ్​ యాత్రలో భాగంగా భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ క్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ధామ్‌లతో యాత్ర ప్రారంభం అయింది. మే 2న కేదార్‌నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. దీంతో వేలాది మంది భక్తులు యాత్రకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వర్షాల నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...