ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌,...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ప‌లువురు నేతలు ఖండిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను అణచివేయాలనే కుట్ర అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. మీడియా కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS activists) ఈ దాడికి దిగారని ఆరోపించారు. ఒకప్పుడు జర్నలిజం గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిన వారు, ఇప్పుడు మీడియా కార్యాలయాలపై (media offices) దాడులు చేయడం వారి వైఖరి ఎలాంటిదో తెలియజేస్తుందని విమర్శించారు.

    ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా (Social Media) వేదికగా మా కార్యకర్తలపై అసత్య ప్రచారాలు, దూషణలు చేశారు. అప్పుడు మేమేమైనా మీ ఇళ్ల మీద దాడులు చేశామా?’ అని బండి ప్రశ్నించారు. మరణించిన యాంకర్ ఘటనలో బీఆర్ఎస్ నాయకులపై (BRS Leaders) వచ్చిన ఆరోపణల నుంచి దృష్టిని మళ్లించేందుకే వారు ఈ దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రజల్లో భయం నెలకొల్పే ప్రయత్నంగా, మీడియా స్వేచ్ఛను అణచివేసే చర్యగా దీన్ని ఖండించారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్‌కు గతంలో మద్దతుగా ఉన్న మహా న్యూస్ ఛానెల్‌పైనే (Mahaa News Channel) ఈ దాడి జరగడం ఎంత దారుణమో అని వ్యాఖ్యానించారు.

    ‘మీరు కెమెరాలు పగులగొట్టగలరు కానీ నిజాన్ని కాదు. గొంతులను మూయించగలరు కానీ ప్రశ్నలను ఆపలేరు. ఛానెల్‌పై దాడి చేయవచ్చు కానీ జర్నలిజాన్ని అంతం చేయలేరు,” అంటూ బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా దీనిని తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తల‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని తెలియజేయడానికి నిర్దిష్టమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతులు ఉంటాయని, ఇలా కార్యాల‌యాల‌పై దాడులు చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని అన్నారు. చంద్ర‌బాబు (CM Chandra babu) కూడా దీనిని ఖండిస్తూ ఇది అత్యంత దారుణమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి హింసాత్మక ఘటనలకు చోటు లేద‌ని అన్నారు. బెదిరింపులు, దాడుల ద్వారా మీడియా గొంతును నొక్కేయాల‌ని చూస్తే సమాజం ఎప్పటికీ అంగీకరించదని అన్నారు. మ‌రోవైపు ప్రజల గొంతుకను వినిపించే మీడియా సంస్థలపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణించాలంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు.

    More like this

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​...