అక్షరటుడే, బోధన్: TUCI | టీయూసీఐ ఆధ్వర్యంలో ఈనెల 31న ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర నాయకులు మల్లేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కరపత్రాలను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోధన్ పట్టణంలోని (Bodhan Town) మున్సిపాలిటీలో పనిచేసే ఎన్ఎంఆర్(NMR), కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల (Outsourcing workers) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరందరిని తక్షణమే పర్మినెంట్ చేయాలని.. 72 రంగాల కార్మికుల సమ్యల పరిష్కారం కోసం ఈనెల 31న ‘చలో కలెక్టరేట్’ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు రూ. 26 వేల వేతనం ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ రూ. 9వేలకు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.అక్కయ్య, పట్టణ నాయకులు జ్ఞానేశ్వర్, నారాయణ, సురేష్, మహేశ్, దత్తు, రవి తదితరులు పాల్గొన్నారు.