Chain snatching

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో చైన్​ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గత కొన్ని నెలల క్రితం వరుసగా చైన్​ స్నాచింగ్​ ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇటీవల నగరంలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. తాజాగా.. నిజామాబాద్​ నగరంలోని ఐదో టౌన్​ పరిధిలో చైన్​ స్నాచింగ్ chain snatching in nizamabad జరిగింది. 300 క్వార్టర్స్​ వద్ద సావిత్రి అనే మహిళ మంగళవారం ఉదయం వాకిలి ఊడుస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు పల్సర్​ బైక్​పై వచ్చారు. మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళ అప్రమత్తమయ్యేలోగా స్నాచర్లు పారిపోయారు. దీంతో వెంటనే ఐదో టౌన్​ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై గంగాధర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.