Homeజిల్లాలునిజామాబాద్​Banswada | కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

Banswada | కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జి యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బాన్సువాడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జి యెండల లక్ష్మీనారాయణ (Yendala Lakshminarayana) సూచించారు.

నస్రుల్లాబాద్​ మండలంలో (Nasrullabad Mandal) బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉచిత గ్యాస్​ సిలిండర్లు, జన్​ధన్​ ఖాతాలు, ఉచిత బియ్యం వంటి పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

పంచాయతీల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర నిధుల ద్వారానే సాధ్యమవుతోందని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, నస్రుల్లాబాద్​ మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్​ఛార్జి మోహన్ రెడ్డి, సున్నం సాయిలు, వడ్ల సతీష్, లక్ష్మణు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.