ePaper
More
    HomeజాతీయంCentral government | యాక్సిడెంట్ బాధితులకు కేంద్రం చేయూత.. రూ.1.50 లక్షల ఆర్థిక సాయం

    Central government | యాక్సిడెంట్ బాధితులకు కేంద్రం చేయూత.. రూ.1.50 లక్షల ఆర్థిక సాయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : central government | రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం (central government) కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది.

    రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) గాయపడిన వారికి, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేలా ‘క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​ ఫర్​ రోడ్​ యాక్సిడెంట్​ విక్టిమ్స్​ స్కీం -2025’ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు (road accident victims) నగదు రహిత చికిత్స పథకాన్ని అందించేందుకు గాను కేంద్రం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచే అమలులోకి వచ్చిన ఈ పథకం కింద బాధితుడు ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు ఏదైనా గుర్తింపు పొందిన హాస్పటల్లో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందవచ్చు.

    central government | తరచూ ప్రమాదాలు..

    దేశంలో రోడ్డు ప్రమాదాలు (road accidents) నిత్యకృతమయ్యాయి. ఎంతో మంది మరణిస్తుండగా, లక్షలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది తీవ్రంగా గాయపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువగా నష్టపోతోంది ద్విచక్ర వాహనదారులు, పాదచారులేనని నేషనల్ క్రైం (National Crime) రికార్డ్స్బ్యూరో వెల్లడించింది.

    central government | ఉచిత చికిత్స

    ఎవరైనా వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ పథకం (scheme) కింద దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వారికి ఉచిత చికిత్స (free treatment) లభిస్తుంది. బాధితుడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ దవాఖానల్లో (government or private hospitals) ఉచితంగా చికిత్స పొందవచ్చు. డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకూ గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స (free treatment) పొందవచ్చు. అయితే, ప్రభుత్వం (government) ఎంపిక చేసిన ఆసుపత్రులలో మాత్రమే ఈ సౌకర్యం పూర్తిగా వర్తిస్తుంది. కేంద్రం తెచ్చిన ఈ కొత్త పథకాన్ని అమలు చేయడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (National Health Authority), రాష్ట్ర పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థతో కలిసి పని చేయనున్నాయి.

    Latest articles

    Dog Bite | వీధి కుక్కల స్వైర విహారం: ఇరవై మందికి గాయాలు..

    అక్షరటుడే, కామారెడ్డి: Dog Bite | రాజంపేట మండల (Rajampet mandal) కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్...

    Vikram Solar IPO | 19న స్టార్ట్ అవనున్న ఐపీవో.. గ్రేమార్కెట్లో ప్రీమియం ఎంతంటే..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vikram Solar IPO | దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో ఐపీవో వస్తోంది. విక్రమ్...

    Independence Day | స్వాతంత్య్ర వేడుకల‌కు రాహుల్‌, ఖ‌ర్గే దూరం.. విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Independence Day | ఢిల్లీలోని ఎర్ర‌కోటలో శుక్ర‌వారం నిర్వ‌హించిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు కాంగ్రెస్...

    Manikyam Tagore | ఆర్ఎస్ఎస్ ప్ర‌స్తావ‌న అందుకోస‌మే.. ప్ర‌ధాని మోదీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manikyam Tagore | స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌కోట నుంచి జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి...

    More like this

    Dog Bite | వీధి కుక్కల స్వైర విహారం: ఇరవై మందికి గాయాలు..

    అక్షరటుడే, కామారెడ్డి: Dog Bite | రాజంపేట మండల (Rajampet mandal) కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్...

    Vikram Solar IPO | 19న స్టార్ట్ అవనున్న ఐపీవో.. గ్రేమార్కెట్లో ప్రీమియం ఎంతంటే..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vikram Solar IPO | దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో ఐపీవో వస్తోంది. విక్రమ్...

    Independence Day | స్వాతంత్య్ర వేడుకల‌కు రాహుల్‌, ఖ‌ర్గే దూరం.. విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Independence Day | ఢిల్లీలోని ఎర్ర‌కోటలో శుక్ర‌వారం నిర్వ‌హించిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు కాంగ్రెస్...