Banakacherla Project
Banakacherla Project | బనకచర్లపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Banakacherla Project | ఆంధ్ర ప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్​ గురించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ (Rajya Sabha)లో కీలక ప్రకటన చేసింది. గోదావరి జలాలను (Godavari water) కృష్ణ బేసిన్​కు తరలించి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి బనకచర్ల ప్రాజెక్ట్​ నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్​తో గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. బీఆర్​ఎస్ నాయకులు బనకచర్లకు వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు ప్రభుత్వం గోదావరి జలాలను ఏపీకి తరలిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా ఎంపీ ప్రశ్నశకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Banakacherla Project | ఇంకా పనులు చేపట్టలేదు

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌కుమార్‌ (MP Anil Kumar) బనకచర్ల ప్రాజెక్ట్​పై రాజ్యసభలో సోమవారం ప్రశ్న వేశారు. దీంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పింది. బనకచర్ల పనులు ఇంకా చేపట్టలేదని ఏపీ సర్కార్​ చెప్పిందని కేంద్రం తెలిపింది. బనకచర్ల సాంకేతిక-ఆర్థిక అంచనా కోసం కేంద్రం తగిన ప్రక్రియను అనుసరిస్తోందన్నారు. ఈ మేరకు గోదావరి పరీవాహక రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.