ePaper
More
    HomeతెలంగాణElectric Buses | 10,300 ఎలక్ట్రిక్​ బస్సుల కోసం కేంద్రం టెండర్

    Electric Buses | 10,300 ఎలక్ట్రిక్​ బస్సుల కోసం కేంద్రం టెండర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Electric Buses | ప్రస్తుతం మెట్రో నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం పదేళ్లు దాటిన డీజిల్​, 15 ఏళ్లు దాటిన పెట్రోల్​ వాహనాలకు ఇంధనం పోయొద్దని ఆదేశించింది. తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో డీజిల్​ వాహనాలను హైదరాబాద్​ నగరం బయటకు పంపిస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల తెలిపారు. నగరంలో మూడు వేల ఎలక్ట్రిక్​ బస్సులను (Electric Buses) నడుపుతామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central government) భారీగా ఎలక్ట్రిక్​ బస్సుల కొనుగోలు కోసం టెండర్​ పిలిచింది.

    ఎలక్ట్రిక్​ బస్సులు, వాహనాలతో కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్​ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు దేశంలో ఎలక్ట్రిక్​ బైక్​లు, కార్ల (electric bikes and cars) విక్రయాలు భారీగా పెరిగాయి. అయితే ప్రభుత్వ రంగ ట్రాన్స్​పోర్టు కోసం కేంద్రం తాజాగా ఎలక్ట్రిక్​ బస్సుల కోసం టెండర్​ ఆహ్వానించింది. మొత్తం 10,900 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ వేసింది. ఇందులో బెంగళూరుకు 4500 బస్సులు, ఢిల్లీకి 2800, హైదరాబాద్​కు 2000, అహ్మదాబాద్​కు 1000, సురాత్ కు 800 బస్సులను కేటాయించనున్నారు.

    More like this

    Revanth meet Nirmala | విద్యా రంగంలో మార్పుల ప్రయత్నానికి మద్దతు ఇవ్వరూ.. నిర్మలా సీతారామన్​ను కోరిన రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌కృషికి...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...