అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Minister | రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పారు. కాజీపేట నుంచి బల్లార్ష మార్గంలో (Kazipet to Ballarsha route) త్వరలో నాలుగో మార్గం (క్వాడ్రాప్లింగ్) పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం కేంద్ర మంత్రి కాజీపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో నాలుగో మార్గం పనులు చేపడుతామని పేర్కొన్నారు. కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. ఈ యూనిట్తో చాలా మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
Railway Minister Ashwini Vaishnav | తుదిదశకు మూడో లైన్ పనులు
కాజీపేట నుంచి బల్లార్ష వరకు నిత్యం రద్దీ అధికంగా ఉంటుంది. ఈ మార్గంలో వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పటికే రెండు ట్రాక్లు ఉండగా.. మూడో ట్రాక్ పనులు కేంద్ర ప్రభుత్వం (Central Government) చేపట్టింది. ఆ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో మూడో మార్గం కూడా అందుబాటులోకి రానుంది. అయితే రైళ్ల రద్దీ నేపథ్యంలో మరో ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కాగా కాజీపేట – బల్లార్ష మార్గం ఉత్తర-దక్షిణ భారతదేశాలను అనుసంధానించే ముఖ్యమైన మార్గం.
Railway Minister Ashwini Vaishnav | 2026 నాటికి పూర్తి
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (railway coach factory) పనులు 2026 నాటికి పూర్తి చేసి, రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభం ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక్కడ త్వరలోనే 150 లోకోమోటివ్లు ఎగుమతి అవుతాయన్నారు. మెట్రో, వందే భారత్ కోచ్లను (Metro and Vande Bharat coaches) కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తామని ఆయన తెలిపారు.