అక్షరటుడే, హైదరాబాద్: Census 2027 : కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన (Census) 2027 నిర్వహణపై రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది. తొలి విడతగా జరిగే ఇళ్ల గణన (House Listing Operation) ను మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు తెలిపారు.
Census 2027 : అసలు ఘట్టం వచ్చే ఏడాది
హౌజ్ లిస్టింగ్ కోసం కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాపై సీఎస్ వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేటర్లు, నోడల్ అధికారులతో కలిపి మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాల్గొననున్నారు.
ఇక అసలు ఘట్టమైన జనగణన ప్రక్రియను 2027 ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. దేశ వ్యాప్తంగా చేపట్టే ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.11,718 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు జనగణన కీలకంగా భావిస్తారు. ఈ క్రమంలో ప్రజలు ఇందుకు పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
