Homeజిల్లాలునిజామాబాద్​MLA Bhupathi Reddy | రూరల్​ ఎమ్మెల్యేను పరామర్శించిన ప్రముఖులు

MLA Bhupathi Reddy | రూరల్​ ఎమ్మెల్యేను పరామర్శించిన ప్రముఖులు

అక్షరటుడే, డిచ్​పల్లి : MLA Bhupathi Reddy | నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy) తల్లి నరసమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే.. ఆమె అంత్యక్రియలను నగర శివారులోని గూపన్​పల్లి (Goopanpalli) వైకుంఠధామంలో కుటుంబ సభ్యులు మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రముఖులు ఎమ్మెల్యే తల్లి నరసమ్మ పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనను పరామర్శించారు. నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాటిపల్లి నగేష్ రెడ్డి, శేఖర్​ గౌడ్ పరామర్శించిన వారిలో ఉన్నారు.