అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని (Nizamabad Collectorate) కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ (Backward Classes Welfare Department) ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి (Rural MLA Bhupathi Reddy), కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ నారాయణ రావు అందించిన సేవలను వక్తలు కొనియాడారు.
అంతకుముందు వర్ని చౌరస్తాలో ఉన్న కాళోజీ విగ్రహానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.