District Judge
District Judge | రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి : జిల్లా జడ్జి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: District Judge | కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ భరత లక్ష్మి (judge Bharatha Lakshmi) సూచించారు.

నిజామాబాద్ జిల్లా కోర్టులోని తన చాంబర్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న లోక్​అదాలత్​ (Lok Adalat) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న కేసులను న్యాయ సేవాధికార సంస్థ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. జిల్లా వ్యాప్తంగా 1,680 కేసులు రాజీ కోసం ఎంపిక చేశామని వివరించారు. అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.