HomeతెలంగాణKTR | కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్​

KTR | కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :KTR | రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం(congress government) బీఆర్​ఎస్​ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగిందని ఆరోపిస్తూ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా కేసుల్లో విచారణ అధికారులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారం మాజీ మంత్రి, బీఆర్​ఎస్ ప్రెసిడెంట్​ ఏసీబీ(ACB) ఎదుట హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆయనను ఆదేశించింది.

KTR | కేసీఆర్​తో భేటీ

కేటీఆర్(KTR)​ ఏసీబీ విచారణకు బయలు దేరారు. ఈ క్రమంలో నందినగర్‌లోని తన నివాసానికి చేరుకొని మాజీ సీఎం కేసీఆర్‌(Former CM KCR)తో భేటీ అయ్యారు. కాసేపట్లో ఫార్ములా-ఈ కేసు(Formula-E Case)లో ఏసీబీ విచారణకు ఆయన హాజరు కానున్నారు. నందినగర్‌ నుంచి ఏసీబీ ఆఫీసుకు వెళ్లే దారిలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్​ను కేసీఆర్​ విచారించినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.

KTR | దర్యాప్తు వేగవంతం

రాష్ట్ర ప్రభుత్వం బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై విచారణ వేగవంతం చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్​(Kaleshwar Project)లో జరిగిన అక్రమాలపై కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్(Commission Chairman PC Ghosh)​ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్​ను విచారించిన విషయ తెలిసిందే.

మరోవైపు ఫోన్​ ట్యాపింగ్​ కేసు(phone tapping case)లో సిట్ అధికారులు ప్రభాకర్​రావును ఇప్పటికే మూడు రోజులు విచారించారు. మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్​ను ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారించనున్నారు. ఓ వైపు స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం బీఆర్​ఎస్​ నేతలే(BRS leaders) లక్ష్యంగా విచారణ చేపట్టడం గమనార్హం.