అక్షరటుడే, ఇందూరు: RTA Nizamabad | పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. మొదటిరోజు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఫిట్నెస్ పత్రాలతో పాటు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఫిట్నెస్లేని ఒక స్కూల్ బస్సుపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఇన్ఛార్జి డీటీవో రాహుల్, ఎంవీఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలో..

బోధన్ పట్టణంలో స్కూల్ బస్ను తనిఖీ చేస్తున్న ఎంవీఐ శ్రీనివాస్
అక్షరటుడే, బోధన్: ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్లపైకి వస్తే కఠినచర్యలు తీసుకుంటామని బోధన్ ఎంవీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పనిసరిగా తమ స్కూల్ బస్సులను తనిఖీలు చేయించాలని సూచించారు. ఆర్టీవో నిబంధనల ప్రకారం బస్సులను నడపాలని పేర్కొన్నారు. బోధన్ డివిజన్లో 92 స్కూల్ బస్సులు ఉండగా.. 80శాతం ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.
