ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​​ Bheemgal | అక్రమంగా ఇసుక తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు

    ​ Bheemgal | అక్రమంగా ఇసుక తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: ​ Bheemgal | భీమ్​గల్​ మండలం బెజ్జోర గ్రామ శివారులో కప్పలవాగు (Kappalavaagu)లో ఇసుకను అక్రమంగా తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ (SI Sandeep) తెలిపారు.

    బెజ్జోరా శివారులోని కప్పలవాగు నుంచి ఇసుకను జేసీబీలతో (JCB) ట్రాక్టర్లు నింపుతూ..తరలించే సమయంలో పోలీసులు దాడులు చేశారు. ట్రాక్టర్ యజమానులు ఈర్ల మహేందర్, మల్లెల స్వామి, దేశబోయిన రవికుమార్​లపై కేసు నమోదు చేసి, జేసీబీతో పాటు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించామన్నారు.

    తదుపరి చర్యల నిమిత్తం ఏడీ మైన్స్​కు పంపనున్నట్లు ఆయన వివరించారు. భీమ్​గల్ మండలంలో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్సై సందీప్​ హెచ్చరించారు.

    More like this

    Vote Chori | ఓటు చోరుల‌ను కాపాడుతున్న ఈసీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోప‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission)పై కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి...

    BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తాం: పీసీసీ చీఫ్​

    అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని పీసీసీ చీఫ్​ బొమ్మ...

    IRCTC | శివ‌భ‌క్తులకు రైల్వే గుడ్‌న్యూస్‌.. జ్యోతిర్లింగాల ద‌ర్శ‌నం ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IRCTC | శివ భ‌క్తుల కోసం భారతీయ రైల్వే (Indian Railways) ఒక ప్రత్యేక...