HomeతెలంగాణCase on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. డిజిటల్​ చెల్లింపులతో మంచి ఆదరణ పొందిన ఈ కంపెనీ ఆన్​లైన్​ బెట్టింగ్​ను (Online Betting) ప్రొత్సహిస్తోందని ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.

తెలంగాణ పోలీసులు (Telangana Police) ఆన్​లైన్​ బెట్టింగ్​పై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో బెట్టింగ్​ యాప్​ను ప్రమోట్​ చేసిన సినీ ప్రముఖులు, యూ ట్యూబర్లపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సైతం విజయ్​దేవరకొండ, రాణా, ప్రకాశ్​రాజు, మంచు లక్ష్మికి నోటీసులు (ED Notice) జారీ చేసింది. ఈ క్రమంలో మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) కార్డ్స్, MPL రమ్మీ వంటి వాటిని పేటీఎం ప్రోత్సహిస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Case on PAYTM | గేమింగ్​ చట్టం ప్రకారం

తెలంగాణ ఆన్​లైన్​ బెట్టింగ్​, గేమింగ్​పై నిషేధం ఉంది. అయినా కొందరు వ్యక్తులు ఇతర రాష్ట్రాల అడ్రస్​లతో గేమ్​లు ఆడుతూ అప్పులు చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పేటీఎం ఎంపీఎల్​ కార్డ్స్​, ఎంపీఎల్​ రమ్మీ గేమ్​లను ప్రోత్సహిస్తోందని శుక్రవారం ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం 2000, 2008లోని సెక్షన్ 66 రెడ్ విత్ 43 , తెలంగాణ గేమింగ్ చట్టం సెక్షన్ 3ఏ కింద సైబర్​ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సంస్థ ప్రమోట్ చేస్తున్న యాప్స్‌లో జూదం కంటెంట్ ఉంటోందని.. తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు.