Homeతాజావార్తలుMLA Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

MLA Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక సందర్భంగా యూసఫ్​గూడలో హల్​చల్​ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్​ రిగ్గింగ్​ చేస్తోందని ఆయన మహమ్మద్‌ ఫంక్షన్‌ హాల్‌లోకి చొచ్చుకు వెళ్లారు. దీంతో పోలీసులు కేసు పెట్టారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Kaushik Reddy | హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి (MLA Padi Kaushik Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక సందర్భంగా మంగళవారం ఆయన హల్​చల్​ చేశారు. యూసుఫ్‌గూడలో మహమ్మద్‌ ఫంక్షన్‌ హాల్‌లోకి చొచ్చుకొని వెళ్లారు.

పోలీసులు వద్దని చెప్పినా వినకుండా అనుచరులతో కలిసి కౌశిక్​రెడ్డి ఫంక్షన్​ హాల్​లోకి వెళ్లారు. దీంతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు (Jubilee Hills by-Elections) రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని కౌశిక్​ రెడ్డి మంగళవారం నిరసన తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కౌశిక్​ రెడ్డిని బీఆర్​ఎస్​ (BRS) యూసఫ్‌గూడ ఇన్​ఛార్జిగా నియమించింది. ఈ క్రమంలో ఆయన హల్​చల్​ చేయడం గమనార్హం. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో గెలవలేని కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనను మంగళవారం అరెస్ట్​ చేసి అక్కడి నుంచి పోలీసులు తరలించారు. తాజాగా బుధవారం కౌశిక్​రెడ్డిపై కేసు నమోదు చేశారు.

Must Read
Related News