ePaper
More
    Homeక్రైంTamil Nadu | కారు–లారీ ఢీ : నలుగురి మృతి.. జడ్జికి తీవ్రగాయాలు

    Tamil Nadu | కారు–లారీ ఢీ : నలుగురి మృతి.. జడ్జికి తీవ్రగాయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tamil Nadu | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు–లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తంజావురుకు చెందిన ఓ న్యాయమూర్తి(Thanjavur Judge) తీవ్రంగా గాయపడ్డారు.

    తంజావూరుకు చెందిన జస్టిస్ పూరణజయ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు వ్యక్తులు తిరుచెందూర్ ఆలయం(Thiruchendur Temple)లో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత శుక్రవారం కారులో తంజావూరుకు బయలుదేరారు. వారి కారు ఎట్టాయపురం సమీపంలోని తూత్తుకుడి-మధురై రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

    ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అరుప్పుకోట్టై ప్రభుత్వ ఆస్పత్రి(Aruppukottai Government Hospital)కి తరలించారు.మృతి చెందిన వారిలో తంజావూరుకు చెందిన న్యాయవాది ధనంజయన్ రామమూర్తి, కారు డ్రైవర్ వసురామనాథన్, న్యాయమూర్తికి సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన మరో పోలీసు ఉన్నారు. ఈ ప్రమాదంలో న్యాయమూర్తి పూరణ జయానంద్‌ తీవ్రంగా గాయపడ్డారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...