ePaper
More
    Homeక్రైంNH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం శ్రీరాంసాగర్​ వద్ద హైవేపై వెళ్తున్న బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.

    తాజాగా.. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దేవీ తండా పెట్రోల్ బంక్ ఎదురుగా 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్​ వైపు వెళ్తున్న కారు పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో నర్సింహా రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి విశాల్​కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నిజామాబాద్​కు తరలించారు. కాగా.. వీరు హైదరాబాద్​ నుంచి ఇచ్చోడ వెళ్తున్నట్లు తెలిసింది.

    More like this

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....