ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Bank Customers | బ్యాంక్ క‌స్ట‌మర్స్‌కి గుడ్ న్యూస్.. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్​పై కీలక నిర్ణయం

    Bank Customers | బ్యాంక్ క‌స్ట‌మర్స్‌కి గుడ్ న్యూస్.. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్​పై కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bank Customers : ఇప్పటివరకు ఏ బ్యాంకులోనైనా Bank మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే. లేదంటే పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు ద్వారా పెద్ద ఉపశమనం లభించబోతోంది.

    ఇప్పుడు మీకు బ్యాంకులో కనీస బ్యాలెన్స్ లేకపోయినా మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన ప‌నిలేద‌ట‌. పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాలనే నియమాన్ని నెరవేర్చాల్సిన అవసరం లేదని కెనరా బ్యాంక్ ప్రకటించింది. ఈ కొత్త నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయంతో, కెనరా బ్యాంక్‌లో ఎలాంటి పొదుపు ఖాతా కలిగిన వారైనా ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఎటువంటి ఛార్జీలు లేదా జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.

    Bank Customers : గుడ్ న్యూస్..

    అన్ని కేటగిరీల సేవింగ్స్ ఖాతాల(savings accounts)కు ఈ కొత్త రూల్ వర్తిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది. పొదుపు ఖాతాలు, ఎన్నారై పొదుపు ఖాతాలు, సాలరీ అకౌంట్స్‌లలో మినిమమ్‌ బ్యాలెన్స్ Minimum Balance నిర్వహించనందుకు బ్యాంకు కస్టమర్లకు ఇకపై ఛార్జీ విధించదని కెనరా బ్యాంక్(Canara Bank) తెలిపింది. జూన్ 1, 2025 నుండి ఇది అమలులోకి వచ్చిందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఒక నెలలో ఖాతాలో నిర్దిష్ట కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు బ్యాంక్ ఛార్జీ విధించేది.బ్యాంకు ఈ చొరవ తర్వాత ప్రజలకు ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కనీస బ్యాలెన్స్ షరతుల(minimum balance conditions)ను నెరవేర్చలేకపోతున్నారు. దీని కారణంగా వారు ప్రతి నెలా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

    READ ALSO  HDFC Bank Scholarship | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందా.. ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే!

    ఈ మార్పుతో, దేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకు(major public sector banks)ల్లో కనీస నిల్వ అవసరాన్ని పూర్తిగా తొలగించిన మొదటి బ్యాంకుగా కెనరా బ్యాంక్ నిలిచింది. అంటే, ఖాతాదారులు తమ సేవింగ్స్ ఖాతాలలో ఎటువంటి రుసుములు లేకుండా జీరో బ్యాలెన్స్‌ను కూడా కొనసాగించవచ్చు. గతంలో, కెనరా బ్యాంక్ Canara BAnk పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ. 2,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 1,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500 కనీస నిల్వను నిర్వహించాలని నిబంధన ఉండేది. ఈ పరిమితులను పాటించడంలో విఫలమైతే పెనాల్టీలు విధించేవారు. ఈ తాజా మార్పు విద్యార్థులు(students), మహిళలు(women), సీనియర్ సిటిజన్లు(senior citizens), అల్ప ఆదాయ వర్గాలకు చెందిన వారితో సహా విస్తృత శ్రేణి వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనుంది.

    READ ALSO  Operation Sindoor | ప్ర‌త్యేక పాఠ్యాంశంగా ఆప‌రేష‌న్ సిందూర్.. స‌న్నాహాలు చేస్తున్న ఎన్‌సీఈఆర్టీ

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...