అక్షరటుడే, బోధన్ : Navipet | బోధన్ (Bodhan) నియోజకవర్గంలో దోంగలు రెచ్చిపోయారు. నవీపేట్ మండల కేంద్రంలో ఓ నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని మెయిన్రోడ్లో ఉన్న ఓ సిల్వర్ మర్చంట్ దుకాణానికి దుండగులు గ్యాస్ కట్టర్ (Gas Cutter)తో షట్టర్కు రంధ్రం చేశారు. అనంతరం దుకాణంలోకి చొరబడ్డారు. అయితే బంగారం ఉన్న లాకర్ను పగులగొట్టే ప్రయత్నం చేసే సమయంలో రోడ్డుపై అలికిడి వినబడడంతో వెంటనే వెండివస్తువులను ఎత్తుకుని పారిపోయినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి (SI Tirupati) మాట్లాడుతూ.. దుకాణాదారుల నుంచి ఫిర్యాదు అందలేదని.. అనంతరం దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
