ePaper
More
    Homeక్రైంDichpalli | దుబాయి నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో మృతి

    Dichpalli | దుబాయి నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో మృతి

    Published on

    అక్షరటుడే, డిచ్‌పల్లి : Dichpalli | ఆ యువకుడు బతుకుదెరువు కొన్నేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. అక్కడ పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఇంటికొచ్చి పెళ్లి చేసుకొని స్థిర పడాలనుకున్నాడు. ఈ క్రమంలో వారం క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ యువకుడిని కబలించింది. ఈ విషాద ఘటన డిచ్​పల్లి మండలంలో (Dichpalli mandal) చోటు చేసుకుంది.

    డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​ గ్రామానికి (Ghanpur village) చెందిన ఒడ్డేపల్లి రంజిత్‌(30) కొంతకాలంగా దుబాయిలో పని చేస్తున్నాడు. అయితే ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బైక్​ వెళ్తుండగా ఘన్​పూర్​ సమీపంలో అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రంజిత్​ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి చేసుకుంటాడనుకున్న కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

    More like this

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...