HomeతెలంగాణHigh Court | విద్యుత్​ స్తంభాలకు కేబుల్​ వైర్లు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

High Court | విద్యుత్​ స్తంభాలకు కేబుల్​ వైర్లు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | విద్యుత్​ స్తంభాలకు టీవీ, ఇంటర్​ నెట్ కేబుళ్లతో (TV and internet cables) ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యుత్​ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవల రామాంతపూర్​లో శ్రీకృష్ణాష్టమి (Sri Krishna Ashtami) సందర్భంగా రథాన్ని లాగుతుండగా విద్యుత్​ షాక్​ తగిలి ఐదుగురు మృతి చెందారు.

రామాంతపూర్​ ఘటనకు కేబుల్​ వైర్లే కారణమని అధికారులు పేర్కొన్నారు. దీంతో స్తంభాలకు ఏర్పాటు చేసిన వైర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారులు విద్యుత్​ స్తంభాలకు ఏర్పాటు చేసిన ఇంటర్​నెట్​, టీవీ కేబుళ్లను తొలగిస్తున్నారు. అయితే ఈ రామాంతపూర్​ ఘటనను సుమోటగా స్వీకరించిన హైకోర్టు (High Court) రెండు రోజుల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, ఎస్​పీడీసీఎల్​, జీహెచ్​ఎంసీ, భారతీ ఎయిర్​టెల్​ కంపెనీలకు (Bharti Airtel company) నోటీసులు ఇచ్చింది. ఎయిర్​టెల్​ కంపెనీ కేబుల్​ వైర్లతో సదరు ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

High Court | అనుమతి తప్పనిసరి

హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో శుక్రవారం ఎయిర్​టెల్​ కంపెనీ శుక్రవారం పిటిషన్​ వేసింది. ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ స్తంభాలకు (electricity poles) లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు మాత్రమే ఉంచాలని ఆదేశించింది. అనుమతి లేకుండా కేబుళ్లు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడంపై సీరియస్​ అయింది. విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అంటూ ప్రశ్నించింది. అనంతరం జస్టిస్​ నగేశ్​ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

High Court | ఇబ్బందులు పడుతున్న ప్రజలు

విద్యుత్​ స్తంభాలకు ఇష్టారీతిన ఏర్పాటు చేసిన కేబుళ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇంటర్​ నెట్​, టీవీ కేబుళ్లను (internet and TV cables) తొలగిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్​ నెట్​ కేబుళ్లు కట్​ చేస్తుండటంతో నెట్​ రాక అవస్థలు పడుతున్నారు.