Homeతాజావార్తలుGig Workers | గిగ్​ వర్కర్ల బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

Gig Workers | గిగ్​ వర్కర్ల బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ గిగ్​ వర్కర్ల బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే కార్మికులకు పలు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gig Workers | గిగ్​ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి కీలక బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ 2025 బిల్లుకు (Gig Workers 2025 Bill) ఓకే చెప్పింది. దీంతో దీనిని తర్వలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ఛాన్స్​ ఉంది.

నీతి ఆయోగ్ నివేదిక (NITI Aayog report) ప్రకారం రాష్ట్రంలో 3 లక్షల మంది గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు ఉన్నారు. వారు రవాణా, డెలివరీ, గృహ సేవలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిలో పనిచేస్తున్నారు. వీరు రోజుకు 10–12 గంటలు, వారానికి 7 రోజులు పని చేస్తారు. ఉద్యోగ భద్రత, బీమా (job security and insurance) వంటి సౌకర్యాలు లేకుండానే వీరు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారికి మేలు చేసేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు రానుంది. తాజాగా దానికి కేబినెట్​ ఆమోదం తెలిపింది.

Gig Workers | బిల్లు ముఖ్యాంశాలు

ఈ బిల్లు అమలులోకి వస్తే గిగ్​ వర్కర్లకు చట్టబద్దమైన గుర్తింపు లభించనుంది. కార్మికులు రాష్ట్ర పథకాలు (state schemes),రక్షణకు అర్హత పొందుతారు. సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. 20 మంది సభ్యుల బోర్డు ఛైర్మన్​గా కార్మిక శాఖ మంత్రి వ్యవహరిస్తారు. సంక్షేమ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. సురక్షితమైన పని పరిస్థితులను కలిపించే హక్కును గిగ్​ వర్కర్లు కలిగి ఉంటారు. చెల్లింపులు, తగ్గింపులు, రేటింగ్లు, అల్గోరిథంలలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Gig Workers | రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

గిగ్​ వర్కర్లు (Gig workers) ప్రభుత్వ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. కార్మికులు స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ప్లాట్ఫారమ్లు 60 రోజుల్లోపు కార్మికుల డేటాను షేర్ చేయాల్సి ఉంటుంది. అగ్రిగేటర్లు 45 రోజుల్లోపు నమోదు చేసుకోవాలి. గిగ్​ వర్కర్ల కోసం సంక్షేమ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అలాగే కార్మికులను తొలగించాలంటే.. ఒప్పంద మార్పులకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. దుష్ప్రవర్తన మినహా తొలగింపునకు 7 రోజుల నోటీసు ఇవ్వాలి.