అక్షరటుడే, వెబ్డెస్క్:India-Pak | పహల్గామ్లో ఉగ్రవాది(Terror Attack) తర్వాత పాకిస్తాన్కు సింధు జలాలు నిలిపివేయాలన్న భారత నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ(Former Pakistani minister Bilawal Bhutto Zardari) తీవ్రంగా స్పందించారు. ‘సింధు నదిలో అయితే నీళ్లు పారాలి లేకపోతే వారి(భారతీయుల) రక్తం పారాలని’ వ్యాఖ్యానించారు. జమ్మూ శ్మీర్లోని పహల్గామ్(Pahalgam)లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్(Pakistan) సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని పేర్కొంటూ 1960 సింధు జలాల ఒప్పందాన్ని భారత్(India) నిలిపి వేసింది. ఈ నిర్ణయంపై బిలావల్ తీవ్రంగా స్పందించారు.
India-Pak | మోదీపై అక్కసు..
ప్రధాని మోదీ(Prime Minister Modi)పై బిలావల్ అక్కసు వెల్లగక్కారు. ప్రధాని తన బలహీనతలను దాచి పెట్టి ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. “పహల్గామ్ సంఘటనకు భారతదేశం పాకిస్తాన్పై ఆరోపణలు చేసింది. మోదీ తన సొంత బలహీనతలను దాచిపెట్టి తన ప్రజలను మోసం చేయడానికి తప్పుడు ఆరోపణలు చేశారు. సింధు నది పాకిస్తాన్కు చెందినదని భారతదేశం అంగీకరించిన సింధు జలాల ఒప్పందాన్ని ఆయన ఏకపక్షంగా నిలిపివేయాలని నిర్ణయించారు. సింధు నది(Sindhu River) పక్కన ఉన్న సుక్కూర్లో ఇక్కడ నిలబడి, సింధు నది మనదేనని, అది మనదేనని భారతదేశానికి చెప్పాలనుకుంటున్నాను. ఈ సింధులో నీరు ప్రవహిస్తుంది, లేదా వారి రక్త సంకల్పం ప్రవహిస్తుందని” వ్యాఖ్యానించారు
