Homeక్రీడలుINDvsENG | చేలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లాండ్​ ఆలౌట్​

INDvsENG | చేలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లాండ్​ ఆలౌట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: INDvsENG | లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్ట్​లో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో ఇంగ్లిష్​ జట్టు తొలి ఇన్నింగ్స్​లో 387 పరుగులకు ఆలౌట్​ అయింది. ఐదు మ్యాచ్​ల ఈ సిరీస్​లో (five-match series) ఇప్పటికే రెండు చెరో మ్యాచ్​లో గెలిచాయి. సిరీస్​ గెలవాలంటే ఈ మ్యాచ్​ కీలకం. ఈ క్రమంలో ఆది నుంచి భారత బౌలర్లు (Indian bowlers) నిప్పులు చెలరేగారు. నితిశ్​ కుమార్​రెడ్డి వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్​ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

INDvsENG | సెంచరీతో ఆదుకున్న రూట్​

రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లిష్​ జట్టును పోప్​, జో రూట్​ ఆదుకున్నారు. జో రూట్​ సెంచరీతో రాణించాడు. లంచ్​ తర్వాత తన తొలి ఓవర్లోనే జడేజా ఒల్లి పోప్​ను (44) ఔట్​ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. జో రూట్​ సెంచరీ చేశాడు. మరో వైపు భారత పేసర్​ జస్పీత్​ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్లతో రాణించాడు. ఇంగ్లాండ్​ బ్యాటర్లు బెన్​ స్టోక్స్​ 44, జేమి స్మిత్ ​51, బ్రైడన్​ కార్స్​ 56 పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్​లో 387 పరుగులు చేసింది. సిరాజ్​, నితీశ్​కుమార్​ చెరో రెండు వికెట్లు తీశారు.

INDvsENG | లార్డ్స్​లో గెలవాలంటే..

భారత్​కు లార్డ్స్​ స్టేడియంలో (Lord Stadium) అంత మంచి రికార్డులు లేవు. ఇక్కడ ఇప్పటి వరకు భారత్​ 19 మ్యాచ్​లు ఆడగా మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. 12 సార్లు ఇంగ్లాండ్​ గెలవగా.. నాలుగు మ్యాచ్​లు డ్రా అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలుపొందాలని భారత్​ భావిస్తోంది. అయితే ఇక్కడ గెలవడం అంత ఈజీ కాదు. కానీ భారత జట్టు తొలి ఇన్నింగ్స్​లో భారీ స్కోర్​ చేయగలిగితే మాత్రం విజయం సొంతం చేసుకోవచ్చు.