అక్షరటుడే, ఇందూరు : BRS Road Development Claims | నగరంలోని ప్రతిగల్లీలో రోడ్లు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాల్వాడి చౌరస్తాలో 35వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి (Corporator Candidate) తాటికొండ నరేష్కు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
BRS Road Development Claims | మీరు చందాలు వసూలు చేస్తే మేము ఆలయాలే కట్టించాం..
ఈ సందర్భంగా బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఆలయాల నిర్మాణానికి చందాలు వసూలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా ఎన్నో ఆలయాలనే నిర్మించిందని అన్నారు. ధన్పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే తన సొంత ట్రస్ట్ నుంచి అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారని.. ఆ మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు.
ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తానని..
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటిచ్చారని ఇప్పటివరకు ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. కల్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇస్తానని కూడా హామీ ఇచ్చి మరిచారన్నారు. నగరాన్ని సుందరంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని.. రాత్రి వేళల్లో నగరం వెలిగిపోయేలా చేసింది బీఆర్ఎస్ (BRS) అని ఆయన గుర్తు చేశారు. అలాంటి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కాలనీల్లో మీ వెంటే ఉంటూ అభివృద్ధికి పాటు పడతారని ఆయన పేర్కొన్నారు. 35వ డివిజన్ అభ్యర్థి తాటికొండ నరేష్ను భారీ మెజారిటీతో గెలిపించే ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.