HomeతెలంగాణBus Bhavan | ఛార్జీల పెంపుపై బీఆర్​ఎస్​ ఆందోళన.. బస్​ భవన్​ వద్ద ఉద్రిక్తత

Bus Bhavan | ఛార్జీల పెంపుపై బీఆర్​ఎస్​ ఆందోళన.. బస్​ భవన్​ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్​ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్​ఎస్​ నాయకులు బస్​ భవన్​ ముట్టడికి పిలుపునిచ్చారు. కేటీఆర్​, హరీశ్​రావు ఆర్టీసీ బస్సుల్లో బస్​ భవన్​ వద్దకు చేరుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bus Bhavan | బస్​ ఛార్జీల పెంపుపై బీఆర్​ఎస్​ (BRS) నాయకులు నిరసన చేపట్టారు. హైదరాబాద్​లోని బస్​ భవన్​ ముట్టడికి పిలుపునిచ్చారు.

ఆర్టీసీ ఇటీవల హైదరాబాద్​ సిటీ (Hyderabad City) బస్సుల్లో ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా గురువారం ఉదయం బీఆర్​ఎస్​ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు కేటీఆర్​ (KTR), హరీశ్​రావు (Harish Rao), బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున బస్​భవన్​కు బయలు దేరారు. కేటీఆర్​, హరీశ్​రావు ఆర్టీసీ బస్​లో ప్రయాణించారు. ఛార్జీల పెంపును వారు ఖండించారు.

Bus Bhavan | ఛార్జీలు తగ్గించాలి

కేటీఆర్​ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణారహితంగా సిటీ బస్సు చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అని చెబుతున్నారని, కానీ బస్సుల్లో వారికి సీట్లు దొరకడం లేదన్నారు. బస్సుల సంఖ్య పెంచాలని ఆయన డిమాండ్​ చేశారు. ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. మహిళలకు ఫ్రీ అని చెప్పి, మగవారికి ఛార్జీలు డబుల్ చేశారని, పిల్లలకు బస్ పాసుల ఫీజును పెంచితే కుటుంబం మీద భారం పడదా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి ఆర్టీసీని ప్రైవేట్​ పరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ హయాంలో మొదలెట్టిన ఆర్టీసీ కార్గో సేవలు సంవత్సరానికి రూ.100 కోట్ల ఆదాయం తెస్తే, దాన్ని రూ.36 కోట్లకు ప్రైవేట్ పరం చేశారని విమర్శించారు. పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్​ చేశారు.

Bus Bhavan | ప్రైవేట్​పరం చేసే కుట్ర

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆర్టీసీని ప్రైవేట్​ పరం చేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్​ రావు ఆరోపించారు. కమీషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు, ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ఈ కుట్రకు తెరలేపారన్నారు. రాష్ట్రంలోని అనేక బస్టాండ్​లను తాకట్టు పెట్టి రేవంత్​రెడ్డి రూ.1500 కోట్లు అప్పు తెచ్చాడని ఆరోపించారు. ఆయన మెహదీపట్నం నుంచి బస్ భవన్ వరకు బస్సులో ప్రయాణించారు.

Bus Bhavan | అడ్డుకున్న పోలీసులు

బీఆర్​ఎస్​ బస్​భవన్​కు పిలుపునివ్వడంతో భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు బస్​ భవన్​కు వెళ్లే మార్గాలను మూసేశారు. భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో బీఆర్​ఎస్​ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా ఆర్టీసీ ఎండీని కలవడానికి పోలీసులు ముగ్గురు బీఆర్​ఎస్​ నేతలకు అనుమతి ఇచ్చారు. వారు ఎండీని కలిసి రేట్లు తగ్గించాలని కోరానున్నారు.