Bhatti Vikramarka | బీఆర్​ఎస్​ సభ్యులు భయపడి వెళ్లిపోయారు : డిప్యూటీ సీఎం భట్టి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చ అనగానే బీఆర్ఎస్ సభ్యులు భయపడి సభ నుంచి వెళ్లిపోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ (Assembly) వద్ద మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించడంపై బీఆర్​ఎస్​ సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్​ చస్త్రశారు. అన్ని అంశాలపై చర్చించాలని బీఏసీలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)నే పట్టుబట్టిందన్నారు. వాళ్ల కోరిక మేరకే మేము అన్ని అంశాలపై చర్చ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చ అనగానే బీఆర్ఎస్ సభ్యులు భయపడి సభ నుంచి వెళ్లిపోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ (Assembly) వద్ద మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించడంపై బీఆర్​ఎస్​ సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్​ చస్త్రశారు. అన్ని అంశాలపై చర్చించాలని బీఏసీలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)నే పట్టుబట్టిందన్నారు. వాళ్ల కోరిక మేరకే మేము అన్ని అంశాలపై చర్చ పెడుతున్నామని తెలిపారు. వాళ్లకు ఇబ్బందైన రోజు వాకౌట్ చేశారంటే ఓకే కానీ, మిగతా రోజులు కూడా రావకపోడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ ప్రజా సమస్యలపై చర్చ నుంచి తప్పించుకుంటుందని మండిపడ్డారు.

Bhatti Vikramarka | ప్రతిపక్షానికి బాధ్యత లేదా

కేంద్ర ప్రభుత్వం (Central Government) ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసిందని భట్టి అన్నారు. రాష్ట్రాలపై భారం అదనపు భారం వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్​ పాల్గొనకపోవడం సరికాదన్నారు. దానిపై చర్చించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం బీఆర్​ఎస్​కు ఇంపార్టెంట్​ కాదా అన్నారు. చర్చలో పాల్గొనకుండా సభను బహిష్కరించడం ప్రజలకు అన్యాయం చేయడమే అన్నారు.
సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ జరగాలనేది స్పీకర్​ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మండలి కవిత కంటతడి పెట్టడంపై భట్టి విక్రమార్క స్పందించారు. ఆమె మాట్లాడిన ప్రతి మాట సభలో రికార్డు అయిందన్నారు.

Related articles

Sensex Nifty Gains | లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ 479 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు లాభపడ్డాయి.

MLA Resignation Demand | ఎమ్మెల్యేను రాజీనామా చేయించడానికే వచ్చాం: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్​

ప్రభుత్వ కళాశాలకు సంబంధించి అన్ని ఆధారాలతో వచ్చామని.. ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్​ అన్నారు. కలెక్టరేట్​ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు.

Kamareddy corruption free governance | కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందించాలి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy corruption free governance | కామారెడ్డి పట్టణ ప్రజలకు (Kamareddy Municipality) అవినీతి రహిత పాలన అందించాలని కొత్తగా బాధ్యతలు...

Kalvakuntla Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ : కల్వకుంట్ల కవిత

జోగులాంబ గద్వాల జిల్లా నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు