Homeజిల్లాలునిజామాబాద్​Mla Bhupathi Reddy | నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యేను పరామర్శించిన బీఆర్​ఎస్​ నేతలు

Mla Bhupathi Reddy | నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యేను పరామర్శించిన బీఆర్​ఎస్​ నేతలు

Mla Bhupathi Reddy | నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లి లక్ష్మీ నర్సమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్​ఎస్​ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Mla Bhupathi Reddy | నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి(Mla Bhupathi Reddy) తల్లి లక్ష్మీ నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు శనివారం బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి(MLA Prashanth Reddy), మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Goverdhan)​ తదితరులు నగరంలోని బైపాస్ రోడ్​లో ఉన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి నివాసానికి వెళ్లారు.

ఆయన తల్లి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం భూపతిరెడ్డితో మాట్లాడి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. లక్ష్మీనర్సమ్మ మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. వారి వెంట పలువురు బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.