ePaper
More
    HomeతెలంగాణCM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | రాష్ట్రంలో బీఆర్​ఎస్ (BRS)​ రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయిందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. చనిపోయిన పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారం పోయి హరీష్‌రావు అసహనంతో మాట్లాడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

    CM Revanth | అందుకే బీజేపీ గెలిచింది

    రాష్ట్రంలో లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు బీఆర్ఎస్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ చేసిందని రేవంత్​రెడ్డి అన్నారు. అందుకే బీజేపీ 8 స్థానాల్లో గెలిచిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కోసం పనిచేసినందుకే మెదక్‌లో బీఆర్​ఎస్​ ఓడిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy)పై సైతం సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్‌రెడ్డి కేటీఆర్‌కు లైజనింగ్ ఆఫీసరని, ప్రైవేట్​ ట్యూషన్ మాస్టర్ అని అన్నారు. కిషన్​రెడ్డి బీఆర్​ఎస్ కోసం​ పని చేస్తున్నారని ఆరోపించారు. తాను ఢిల్లీకి వెళ్లకముందే కిషన్ రెడ్డి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కేంద్ర పెద్దలతో కిషన్ రెడ్డి మాట్లాడారని ఆరోపించారు.

    READ ALSO  Chada Venkata Reddy | కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

    CM Revanth | ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు

    గోదావరి జలాల (Godavari Water) తరలింపునకు బీజం వేసిందే బీఆర్ఎస్ అని సీఎం ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్​లో కేసీఆర్ అందుకు ఆమోదం తెలిపారన్నారు. దీంతోనే చంద్రబాబు నాయకుడు బనకచర్ల ప్రాజెక్ట్​తో గోదావరి నీళ్లను తరలించారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలని బీఆర్​ఎస్​ గెలవాలన్నా అవే కావాలని ఆయన అన్నారు. అందుకే ఈ నీటి వివాదాలు అని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. చర్చలకు తామే ఒక అడుగు ముందుకేస్తామని.. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజులైనా చర్చల కోసం కూర్చోవడానికి తాము సిద్ధం అన్నారు.

    READ ALSO  Mir Alam Tank | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మీరం ఆలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.430 కోట్లు

    Latest articles

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    Bandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay | భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay...

    More like this

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...