HomeతెలంగాణPCC Chief | బీఆర్‌ఎస్‌ నాలుగు ముక్కలయ్యింది.. పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సంచలన వ్యాఖ్యలు

PCC Chief | బీఆర్‌ఎస్‌ నాలుగు ముక్కలయ్యింది.. పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : PCC Chief | రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. త్వరలో స్థానిక ఎన్నికలు (Local Body Elections) జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు జోరు పెంచాయి. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్ (PCC Chief Mahesh Goud)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్ (BRS)​ నాలుగు ముక్కలు అయిందని ఆయన అన్నారు. కరీంనగర్​లో జరిగిన కార్యకర్తల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇక బీఆర్‌ఎస్‌ ఉండదని మహేశ్​గౌడ్​ అన్నారు. మేడిగడ్డతోనే బీఆర్‌ఎస్‌ మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. ‘పది మంది ఎమ్మెల్యేల సంగతి తర్వాత ముందు మీ కుటుంబ ఆస్తుల పంచాయితీ చూసుకోవాలని’ కేటీఆర్​కు సూచించారు. బీఆర్ఎస్​ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. ఆ పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఇటీవల కేటీఆర్​ డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ నాలుగు ముక్కలు అయిందని వ్యాఖ్యానించారు. కాగా ఎమ్మెల్సీ కవిత పార్టీ నుంచి దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

PCC Chief | పేదల సంక్షేమమే ధ్యేయం

పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మహేశ్​ గౌడ్​ అన్నారు. కాంగ్రెస్​ పాలనలో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికే జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేపట్టామన్నారు. పాదయాత్రతో బీజేపీ, బీఆర్​ఎస్​కు కడుపు నొప్పి వస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టామన్నారు. అట్టడుగు వర్గాల వారికి సంక్షేమం చేర్చడమే తమ లక్ష్యమన్నారు.

PCC Chief | కార్యకర్తలను వదులుకోం

రాష్ట్రంలో కార్యకర్తల త్యాగాలతోనే కాంగ్రెస్ (Congress)​ అధికారంలోకి వచ్చిందని మహేశ్​ గౌడ్​ అన్నారు. పార్టీ కోసం ఏళ్లుగా పని చేస్తున్న కార్యకర్తలను వదులుకోమని ఆయన చెప్పారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి అవకాశాలు ఉంటాయన్నారు. అయితే పాత వారికి ముందు అవకాశం వస్తుందని స్పష్టం చేశారు.

PCC Chief | రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది

బీజేపీ (BJP) రాష్ట్రానికి ఏం చేసిందని పీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలతోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్​లో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదని ఆయన ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు.

Must Read
Related News