HomeతెలంగాణJubilee Hills | జూబ్లీహిల్స్​లో నకిలీ ఓట్ల వ్యవహారంపై బీఆర్​ఎస్​ ఫిర్యాదు

Jubilee Hills | జూబ్లీహిల్స్​లో నకిలీ ఓట్ల వ్యవహారంపై బీఆర్​ఎస్​ ఫిర్యాదు

Jubilee Hills | జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల వ్యవహారంపై బీఆర్​ఎస్​ నాయకులు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఫేక్​ ఓట్లను తొలగించాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో నకిలీ నోట్లు (Fake Votes) నమోదు అయ్యాయని బీఆర్​ఎస్​ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​, ఇతర నాయకులు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy)ని కలిసి ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్​లో దాదాపు 20 వేల నకిలీ ఓట్లు నమోదు చేశారని బీఆర్​ఎస్ (BRS)​ ఆరోపిస్తుంది. 400 బూత్‌లలో ప్రతి బూత్‌కు దాదాపు 50 నకిలీ ఓట్లు ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. చిన్న స్పెల్లింగ్ మార్పులతో ఒకే వ్యక్తికి రెండు మూడు ఓటర్​ ఐడీలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. 150–200 ఓట్లు సింగిల్ ఇళ్లకు నమోదు చేయబడ్డట్లు బీఆర్​ఎస్​ నాయకులు గుర్తించారు. ఒక ఇంటి నంబర్​తో నమోదైన 23 ఓటర్లలో ఎవరు కూడా అక్కడ ఉండటం లేదని ఆ యజమాని చెప్పినట్లు బీఆర్​ఎస్​ పేర్కొంటుంది. ఇప్పటికే 12 వేల చెల్లని ఓట్లను తొలగించినప్పటికీ, మరో ఏడు వేల నకిలీ ఎంట్రీలు నిశ్శబ్దంగా ఎంటర్​ చేశారని బీఆర్​ఎస్​ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.

దీనిపై కేటీఆర్​ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ద్వారా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేశారు. నకిలీ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారులను తక్షణ బదిలీ చేయాలన్నారు. నకిలీ ఓటర్లను తొలగించాలని కోరారు.

Jubilee Hills | మొదటి రోజు 10 నామినేషన్లు

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక కోసం మొదటి రోజు పది నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. దొంగ ఓట్లపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇపుడు చెప్తున్న 43 ఓట్లు 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.