అక్షరటుడే, వెబ్డెస్క్: Guvvala Balaraju | నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Former Nagarkurnool MLA Guvvala Balaraju) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బీఆర్ఎస్ ను వీడిన ఆయన గులాబీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన నాగర్ కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్(Moinabad farmhouse)లో తాను రూ.100 కోట్లకు అమ్ముడుపోలేదన్న ఆయన.. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడకూడదంటే చేసినదంతా ఒప్పుకోవాలని హెచ్చరించారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు.
Guvvala Balaraju | బీఆర్ఎస్ కుట్రతోనే ఓటమి..
బీఆర్ఎస్ పార్టీ (BRS party) దుస్థితికి అసమర్థ నాయకత్వమే కారణమని గువ్వల అన్నారు. అసమర్థ నాయకత్వం కుట్రలు చేసి నాగర్ కర్నూలులో (Nagarkurnool) తనను ఓడిచిందంటూ పరోక్షంగా కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రను ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పోషించడం లేదన్నారు. ప్రజలు ఏమి ఆశిస్తున్నారో అది చేయకుండా, అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నాయని విమర్శించారు. పార్టీ మనుగడ కార్యకర్తలతోనేనని, కార్యకర్తలకు కష్ట కాలంలో పార్టీ అధి నాయకత్వం అండగా ఉండాలని హితవు పలికారు.
Guvvala Balaraju | నోరు తెరిస్తే సంచలనమే..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కానని, పాత్రధారినేనని ఇటీవల స్పష్టం చేసిన గువ్వల మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో తాను రూ.100 కోట్లకు అమ్ముడు పోలేదని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. గువ్వల బాలరాజు అంటేనే ఒక సెన్సేషన్.. తాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకూడదంటే వాస్తవాలేమిటో ఒప్పుకోవాలని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (BRS party leader KCR) ఏం ఆదేశిస్తే అదే తాను చేశానని చెప్పుకొచ్చారు.
Guvvala Balaraju | జాతీయ పార్టీల నుంచి ఆహ్వానం
బీఆర్ఎస్(BRS)ను వీడిన తనను పార్టీలో చేరాలని కాంగ్రెస్, బీజేపీ ఆహ్వానించాయని మాజీ ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల (BJP and Congress Partys) అది నాయకత్వం నుంచి పిలుపు వచ్చిందన్న ఆయన పేదరిక నిర్మూలన తన లక్ష్యమన్నారు. అయితే, ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన వాయిస్ ప్రజల పక్షాన బతికి ఉండాలంటే.. స్వేచ్ఛ ఉన్న పార్టీ తనకు కావాలని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తన నిర్ణయం ఏమిటో వెల్లడిస్తానని, నియోజకవర్గ ప్రజలు తన నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.