Homeజిల్లాలుకామారెడ్డిCM Revanth Reddy | శాశ్వత ప్రాతిపదికను వంతెన నిర్మాణాలు చేపట్టాలి: సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth Reddy | శాశ్వత ప్రాతిపదికను వంతెన నిర్మాణాలు చేపట్టాలి: సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: CM Revanth Reddy | వరదల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న వంతెనలపై శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో కామారెడ్డి (Kamareddy), ఎల్లారెడ్డిలో (Yellareddy) తీవ్రంగా దెబ్బతిన్న వంతెనలను, పంటలను సీఎం రేవంత్​ రెడ్డి పరిశీలించారు. లింగంపల్లి వంతెనపై (Pocharam Bridge) ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను (Photo exhibition) తిలకించారు.

CM Revanth Reddy | ప్రభుత్వం అండగా ఉంటుంది..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిరకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బురుగిద్దలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం.. రైతులతో మాట్లాడారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు.

అనంతరం ఆయన కామారెడ్డిలోని (Kamareddy) హౌసింగ్​ బోర్డు కాలనీ.. జీఆర్​ కాలనీలో పర్యటన నిమిత్తం ఎల్లారెడ్డి నుంచి బయలుదేరారు. సీఎం వెంట పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్ (PCC Chief Bomma)​, మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ (Government Advisor Shabbir), ఎమ్మెల్యేలు మదన్​మోహన్​రావు (Mla Madan Mohan Rao), లక్ష్మీకాంతారావు(Mla Lakshmi Kanta Rao), మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​ రెడ్డి, ఆయాశాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

పోచారం వంతెనను పరిశీలిస్తున్న సీఎం రేవంత్​రెడ్డి, పీసీసీ చీఫ్​ బొమ్మ, షబ్బీర్​అలీ, ఎమ్మెల్యేలు

పంటనష్టం వివరాలను సీఎంకు ఫొటో ఎగ్జిబిషన్​ ద్వారా వివరిస్తున్న ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు

అధికారుల ద్వారా పంటనష్టాన్ని తెలుసుకుంటున్న సీఎం రేవంత్​రెడ్డి

Must Read
Related News