HomeతెలంగాణTeacher Promotions | హెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్​.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Teacher Promotions | హెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్​.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Teacher Promotions | రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల టీచర్ల ప్రమోషన్లకు (teacher promotions) ఎట్టకేలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు (Education department officials) ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించారు.

స్కూల్​ అసిస్టెంట్లకు గెజిటెడ్​ హెచ్​ఎంలుగా, ఎస్టీటీలకు పీఎస్​ హెచ్​ఎం, స్కూల్​ అసిస్టెంట్లుగా ప్రమోషన్​ కల్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీనియారిటీ జాబితా విడుదల చేసిన అధికారులు సర్టిఫికెట్లు కూడా పరిశీలించారు. షెడ్యూల్​ ప్రకారం బుధవారం హెచ్​ఎంల పదోన్నతుల (HM promotions) కోసం ఆప్షన్​లు ఇవ్వాల్సి ఉంది.

అయితే సీనియారిటీ జాబితాలో అన్యాయం జరిగిందని పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పిటిషన్​పై విచారించిన హైకోర్టు (High Court) ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు ఆప్షన్ల ప్రక్రియను ఆగస్టు 11 వరకు నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆప్షన్ల ప్రక్రియ కొనసాగదని నిజామాబాద్​ డీఈవో అశోక్ (Nizamabad DEO Ashok) తెలిపారు. సీనియారిటీ లిస్టులో తప్పిదాలను సరి చేయడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

నిజామాబాద్​ జిల్లాలో (Nizamabad district) 52 హెచ్​ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో లోకల్ బాడీ పాఠశాలలు 42, ప్రభుత్వ పాఠశాలలు 10 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి వీటిని భర్తీ చేయనున్నారు.