Sabarimala | అయ్యప్ప భక్తులకు బ్రెయిన్​ ఫీవర్​ టెన్షన్​.. కీలక సూచనలు చేసిన కేరళ ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala | శబరిమల అయప్ప స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండడంతో శబరిమలలో (Sabarimala) రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం, దేవస్థానం బోర్డు అధికారులు రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. అయితే రద్దీతో ఇబ్బందులు పడుతున్న భక్తులకు కేరళ ప్రభుత్వం (Kerala Government) మరో షాకింగ్​ న్యూస్​ చెప్పింది. బ్రెయిన్​ ఫీవర్​ (Brain Fever) ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. కేరళలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala | శబరిమల అయప్ప స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండడంతో శబరిమలలో (Sabarimala) రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం, దేవస్థానం బోర్డు అధికారులు రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు.

అయితే రద్దీతో ఇబ్బందులు పడుతున్న భక్తులకు కేరళ ప్రభుత్వం (Kerala Government) మరో షాకింగ్​ న్యూస్​ చెప్పింది. బ్రెయిన్​ ఫీవర్​ (Brain Fever) ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. కేరళలో ఇటీవల బ్రెయిన్​ ఫీవర్​ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయ్యప్ప స్వాములు జాగ్రత్తలు పాటించాలని కేరళ వైద్యారోగ్య శాఖ (Kerala Health Department) సూచించింది. స్వాములు స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొంది.

Sabarimala | ప్రమాదకరమైన వ్యాధి

శబరిమల వెళ్లే యాత్రికులకు నేగ్లేరియా ఫౌలేరితో (Naegleria Fowleri) కలిగే అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (Amebic Meningoencephalitis) నుంచి రక్షించుకోవడానికి జాగ్రత్తలు పాటించాలి. ఈ అమీబా ప్రధానంగా నీటిలో ఉంటుంది. నిలకడగా ఉన్న నీటిలో ఇది ఉంటుంది. దీంతో చెరువులు, కుంటల్లో స్నానం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ముక్కులోకి నీరు వెళ్లకుండా గట్టిగా మూసుకొని స్నానం చేయాలి. నదులు, వాగుల్లో ఈ అమీబా ఉండదు. నేగ్లేరియా ఫౌలేరి చాలా ప్రమాదకరమైనది. ముక్కు ద్వారా ప్రవేశించి మెదడుకు చేరుకుంటుంది. దీనివల్ల తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, వికారం, మెడ దృఢత్వం లేదా ప్రవర్తనా లోపాలు వంటి లక్షణాలు కనిపిస్తే ప్రజలు సమీపంలోని ఆస్పత్రిని సందర్శించాలని అధికారులు సూచించారు.

Sabarimala | భక్తుల కోసం ఏర్పాట్లు

మహిళలు, పిల్లలు శబరిమల సందర్శించడానికి ఏర్పాట్లు చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. బోర్డు సోమవారం సమావేశమవుతుందన్నారు. శబరిమలలో భక్తుల సంఖ్యను పెంచడం అవసరం లేదన్నారు. సౌకర్యాలు పెంచడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దర్శన సౌకర్యాలు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు. స్పాట్ బుకింగ్‌ల సంఖ్యను పెంచినట్లు వెల్లడించారు.

Related articles

Adulterated Milk Deaths Rajahmundry | కల్తీపాల ఘటన.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కల్తీ పాలతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

Chickpea Crop Damage | శనగపంటకు వరుణ గండం.. ఆందోళనలో రైతులు..

అకాల వర్షాలు శనగ పంట రైతుల్లో గుబులు రేపుతున్నాయి. జిల్లాలో ఉదయం జిల్లాలో వర్షం కురియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Stock Market Gains | లాభాల బాటలో మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Kamareddy Chairperson | కామారెడ్డి ఛైర్​పర్సన్​గా ఉమారాణి బాధ్యతల స్వీకరణ.. భారీ బందోబస్తు

కామారెడ్డి మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా ఉమారాణి సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. దీంతో పోలీసులు పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.