అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద (Bichkunda) మండల శాంతాపూర్ (Shanthapur) గ్రామానికి చెందిన భానుప్రసాద్కు (16) మంగళవారం రాత్రి జ్వరం రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో పరిస్థితి విషమించినప్పటికీ పట్టించుకోలేదని.. ఉదయం నిజామాబాద్ ఆస్పత్రికి (Nizamabad GGH) తీసుకెళ్లాలని సూచించారని బాధితులు తెలిపారు.
దీంతో బాలుడిని వెంటనే నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలుడి మృతదేహాన్ని బాన్సువాడకు తీసుకెళ్లి ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. సీఐ అశోక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సముదాయించారు.