ePaper
More
    Homeక్రైంHyderabad | కుమార్తెను వేధిస్తున్నాడని బాలుడి హత్య

    Hyderabad | కుమార్తెను వేధిస్తున్నాడని బాలుడి హత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | తమ కుమార్తెను వేధిస్తున్నాడని ఓ బాలుడిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లోని కుషాయిగూడ పోలీస్​స్టేషన్(Kushaiguda Police Station)​ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. జవహర్‌నగర్‌(Jawaharnagar) కార్పొరేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన ఎండీ రిజ్వాన్‌ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

    ఆయన కుమారుడు అయాన్‌(16) ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో క్యాటరింగ్​ పనికి వెళ్తున్నాడు. అయితే సదరు బాలుడు ఓ బాలికను వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని పథకం ప్రకారం పిలిపించి.. మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అయాన్​ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Ghati Movie | ఘాటీ పరాజయం తర్వాత సోషల్ మీడియా నుండి విరామం తీసుకున్న అనుష్క శెట్టి .. స్వీటీ భావోద్వేగ పోస్ట్ వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ghati Movie | ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి...

    Kamareddy | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి స‌భ వాయిదా.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kamareddy | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వ‌హించ...

    Minister Vakiti Srihari | రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Vakiti Srihari | తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని...