అక్షరటుడే, మోపాల్ : Mugpal | గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. పోలీసులు బాలుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మోపాల్ మండలం (Mugpal Mandal) కులాస్పూర్ గ్రామానికి చెందిన వడ్డేపల్లి గంగాధర్ మనవడు బొద్దుల వరుణ్ డిచ్పల్లి ఎస్సీ హాస్టల్లో (Dichpally SC hostel) ఉంటూ చదువుకుంటున్నాడు. ఇటీవల బాలుడు ఇంటికి వచ్చాడు.
ఇంట్లో చిన్న గొడవ కావడంతో హాస్టల్కు వెళ్తున్నానని చెప్పాడు. అయితే హాస్టల్కు వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. హాస్టల్కు వెళ్లకుండా రెండు రోజుల నుంచి బస్టాండ్, రైల్వే స్టేషన్ సమీపంలో వరుణ్ తిరుగుతున్నట్లు గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి రైల్వే స్టేషన్లో ఉన్న బాలుడిని రైల్వే పోలీసులు విచారించారు. అనంతరం మోపాల్ పోలీసులకు అప్పగించారు. మోపాల్ పోలీసులు వరుణ్ను బుధవారం ఉదయం కుటుంబ సభ్యులకు అప్పగించారు.